ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కూడా వేర్వేరు ప్రతినిధులకు నాయకత్వం వహిస్తున్నారు. మౌర్య డిసెంబర్ 16న నెదర్లాండ్స్కు వెళ్లనుండగా, పాఠక్ డిసెంబర్ 9న మెక్సికో, బ్రెజిల్లకు వెళ్లే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా డిసెంబర్ 9న కెనడాకు వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి సురేశ్ ఖన్నా డిసెంబర్ 9న USA, UKలకు బయలుదేరి డిసెంబర్ 15 నాటికి తిరిగి రానున్నారు. జలశక్తి మంత్రి స్వతంత్రదేవ్ సింగ్ డిసెంబర్ 13న ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ నేతృత్వంలోని బృందం డిసెంబర్ 16న సింగపూర్ వెళ్లనుంది. మత్స్య శాఖ మంత్రి సంజయ్ నిషాద్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డిసెంబర్ 14న అర్జెంటీనాకు వెళ్లనుండగా, పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద డిసెంబర్ 14 నుంచి స్వీడన్కు వెళ్లనున్నారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కోసం సిద్దమవుతున్న ఉత్తర్ ప్రదేశ్..
Uttar Pradesh: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ని ఫిబ్రవరి 10-12 వరకు నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023కి ముందు పెట్టుబడులను ఆకర్షించడానికి వచ్చే వారం రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే రోడ్ షోలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎనిమిది మంది ప్రతినిధులు దాదాపు 20 దేశాలకు బయలుదేరనున్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి