ఆదిలాబాద్లో జనం బాట యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు జైనాథ్ ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. "ఎన్నికల సమయంలోనే బీజేపీ నేతలకు రాముడు గుర్తువస్తాడు. సాధారణ సమయంలో ఆలయాల పట్ల శ్రద్ధ చూపరు" అని ఆమె విమర్శించారు. ఆలయ గర్భగుడిలో దేవుని విగ్రహం పైన నీటి ఊట ఏర్పడినట్టు ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నాగేష్ను ఎంపీ లాడ్స్(MPLADS) నిధుల నుంచి రూ.20 లక్షలు ఆలయాభివృద్ధికి కేటాయించాలని కవిత కోరారు. ఆలయ పునరుద్ధరణకు తాను వ్యక్తిగతంగా దోహదపడతానని ఆమె హామీ ఇచ్చారు.
ఎలెక్షన్లు వచ్చినప్పుడు శ్రీ రాముడు పేరు చెప్పుకొని ఓట్లు అడిగే బీజేపీ.. 1100 ఏళ్ల చరిత్ర గల పురాత జైనథ్ ఆలయాన్ని ఎందుకు పట్టించుకుంటలేదు?: Kalvakuntla Kavitha#Jainathtemple #adilabad #kavithakalvakuntla #telanganajagruthi pic.twitter.com/XYAex92e9a
— Politics Meter (@PoliticsMeter) November 4, 2025

కామెంట్ను పోస్ట్ చేయండి