Odisha: శ్రీ పూరి జగన్నాథ్ ఆలయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రత్యేక పూజలు..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆరు రోజుల ఒడిశా పర్యటనలో భాగంగా ఆమె ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. దేశ ప్రజల సంక్షేమం, శాంతి మరియు అభివృద్ధి కోసం ఆమె ప్రార్థించారు.
దర్శనం తర్వాత, ఆలయ యంత్రాంగం రాష్ట్రపతికి ఖండూవా పట్టు వస్త్రం, జగన్నాథుని పట్టచిత్రం (సాంప్రదాయ ఒడిశా కళారూపం) బహుకరించి సత్కరించింది.
ఒడిశా గవర్నర్ హరి బాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన స్వస్థలమైన మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్కు బయలుదేరారు.
More Photos:





కామెంట్ను పోస్ట్ చేయండి