కలిసిపోయిన బండీటల? బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కుదిరిన సయోధ్య!




తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్లైనా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య కుదిరిన సయోధ్య.

తెలంగాణ బీజేపీలో దీర్ఘకాలంగా ఉన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ కీలకమైన సయోధ్య సమావేశాన్ని ఎంపీ లక్ష్మణ్ నివాసంలో నిర్వహించారు. 

రాజ్య సభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ మధ్యవర్తిత్వం వహించి బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చారు.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా కృషి చేయాలని ఇద్దరు నేతలకు అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేశారు.

ఈ భేటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


\

ఈ సమావేశం తర్వాత ఎంపీ బండి సంజయ్ ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశారు: "మంచి సంభాషణలు, ఉమ్మడి లక్ష్యలతో వారాంతాలు మొదలైతే ఆ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుంది.
రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు, తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ శ్రీ అభయ్ పాటిల్ గారు, ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారితో సమయం గడపడం సంతోషాన్నిచ్చింది.
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారు, బీజేపీ జాతీయ నాయకులు శ్రీ నితిన్ నబిన్ గారు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు శ్రీ ఎన్. రామచందర్ రావు గారి మార్గదర్శకత్వంలో... బలమైన బీజేపీ మరియు బలమైన తెలంగాణ కోసం మేము నిరంతరం కృషి చేస్తున్నాము."

0/Post a Comment/Comments